Headlines
changanti

చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు-నైతికత విలువల సలహాదారు పదవిలో కేబినెట్ హోదాతో ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు చాగంటి. త్వరలోనే ఆయన పూర్తిస్థాయి బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో ముఖ్యమైన బాధ్యత అప్పగించింది.
రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేయించాలని సర్కారు నిర్ణయించింది. రెండ్రోజుల కింద కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను చాగంటితో రూపొందించి పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో కేజీ నుంచి పీజీ దాకా ఇంటిగ్రేట్ చేస్తూనే.. స్టూడెంట్స్‌కు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక తయారు చేయాలనే మరో నిర్ణయం కూడా తీసుకుంది. సర్కారు బడుల్లో చదివే వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ కింద కిట్లు అందజేయాలని నిర్ణయంచింది. దేశంలో యువతలో నైతిక విలువలు పతనం అవుతున్నాయి. చిన్న వయసులోనే చేడు వ్యసనాల బారిన పడుతున్నారు. దేశ భవిత యువత చేతిలోనే వుంది. వీరికి నైతిక విలువలతో కూడిన విద్యను అందించవలసిన బాధ్యత అందరిపై వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pope to bring his call for ethical artificial intelligence to g7 summit in june in southern italy. Dealing the tense situation. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.