Headlines
cyclone

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం. చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 390 కి.మీ,
విశాఖ కు దక్షిణంగా 430 కి.మీ.,
గోపాల్పూర్ నైరుతి దిశలో 610 కి.మీ. దూరంలో కేంద్రీకృతం. రానున్న 24 గంటల్లో ఈశాన్య దిశగా పయనించనున్న వాయుగుండం. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇవాళ కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, మన్యం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం.
తీరం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో గాలులు. ఇవాళ, రేపు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులలో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *