Headlines
పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అనర్హులకు నోటీసుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనర్హులపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షన్ సదుపాయాన్ని అర్హులే పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. అయితే నోటీసుల జారీపై వచ్చిన కొందరి అభ్యంతరాల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సమాచారం.

ఈ సమాచారాన్ని వేగంగా అందించేందుకు ప్రభుత్వం SMSల ద్వారా లబ్ధిదారులకు సమాచారం చేరవేసింది. అనర్హులుగా భావించబడిన వారిని పిలిచి వివరణ తీసుకోవాలని సూచించిన ప్రభుత్వం, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నోటీసులు పంపవద్దని స్పష్టం చేసింది. దీనిపై కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో పెన్షన్ల అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. నోటీసుల ప్రక్రియ, లబ్ధిదారులపై ప్రభావం, ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *