అల్లూరి జిల్లా లో పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి.ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వంజoగి మేఘాల కొండను తిలకించేందుకు పర్యాటకులు తెల్లవారు జాము నుంచే వంజoగి మేఘాల కొండకు చేరుకుని మంచు మేఘాలు..చీల్చుకుంటూ ఉదయించే సూర్య కిరణాలు దృశ్యాలను తిలకించిన పర్యాటకులు ఎంతో తన్మయం చెందుతూ వింత అనుభూతిని పొందారు.సూర్యుడు ఉదయించే సమయంలో సూర్య కిరణాలు మంచు మేఘాల నుంచి ప్రకృతి ప్రసాదించే అందమైన దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.పర్యాటకులు మంచు మేఘాలను, దీవుళ్లా తపించేలా కొండలు దర్సనం ఇవ్వడంతో పర్యాటకులు అందమైన దృశ్యాలను సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
వంజంగి మేఘాల కొండకు ఆదివారం కావడంతో వెలాదిగా పర్యాటకులు రావడంతో వంజoగి మేఘాల కొండ ప్రదేశం అంతా కిక్కిరిసి పోయింది.ఆ రహదారి అంతా పర్యాటకుల వాహనాలతో రద్దీగా మారింది.అలాగే మరో పర్యాటక ప్రదేశం కొత్తపల్లి జలపాతం సందర్శించడానికి వెలాదిగా పర్యాటకులు వచ్చారు.దీంతో జలపాతం అంతా పర్యాటకులతో కిక్కిరిసి పోయింది.జలపాత అందాలను తిలకిస్తూ జలపాతం వద్ద ఉన్న కొలనులో పర్యాటకులు స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేసారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు.అల్లూరి జిల్లా లో ఉన్న అరకు అందాలు,జలపాతాలు,ప్రకృతి ప్రసాదించే అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో పర్యాటక ప్రదేశాలన్నీ కిక్కిరిసి పోయాయి.