41 Killed in Crash Between

మెక్సికో దేశంలో ఘోర ప్రమాదం

దక్షిణ మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సును చుట్టుముట్టడంతో 41 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కొంత మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడగా, ప్రమాదంలో మొత్తం 48 మంది ప్రయాణిస్తున్నారు. కాన్కున్ నుంచి టబాస్కో వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సులోని 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బయటకు రావడం అసాధ్యమయ్యిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు.

Southern Mexico

అధికారుల సమాచారం ప్రకారం, ఇప్పటివరకు మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు పూర్తిగా దగ్ధమవ్వడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై టబాస్కో రాష్ట్ర మేయర్ ఓవిడియో పెరాల్టా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

బస్సు కంపెనీ కూడా ఈ ఘటనపై స్పందించింది. ప్రమాద సమయంలో బస్సు పరిమిత వేగంలోనే ఉన్నదని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది. మెక్సికోలో జరిగిన ఈ ఘోర ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.

Related Posts
Revanth Reddy : ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ
Revanth Reddy letter to Prime Minister Modi

Revanth Reddy : ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ Read more

అభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వంలో మాటలే.. మాది చేతల ప్రభుత్వం: మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha comments on kcr govt

వరంగల్‌: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు వరంగల్ నగరంలో ఈ Read more

భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం
భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం

భారత్, ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపనపై మంగళవారం అధికారికంగా ఒప్పందం మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ Read more

సోనూసూద్ మంచి మనసు.. చిన్నారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్
sonuhelps

సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఖమ్మం (D) చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ Read more