FREE BUS ఎఫెక్ట్.. RTC కీలక నిర్ణయం

మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. దీంతో డబ్బు చెల్లించి టికెట్లు కొనేవారు సీటు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై త్వరలో 300 సెమీడీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని TGSRTC నిర్ణయించింది.

మహిళల ఉచిత ప్రయాణం రద్దీ కారణంగా సెమీ డీలక్స్‌, మెట్రో డీలక్స్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించాలని సంకల్పించింది. ఈ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం లేదని అధికారులు చెప్పారు. సెమీడీలక్స్‌ సర్వీసులు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య నడపనుండగా, నగరంలో మెట్రో డీలక్స్‌ను తిప్పనున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సు కంటే వీటిల్లో టికెట్‌ ధర 5 నుంచి 6 శాతం ఎకువగా, డీలక్స్‌ కంటే 4 శాతం తకువగా ఉండనున్నది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పోలిస్తే సీట్లు ఎకువగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల డిమాండ్‌ రూట్లలోనే వీటిని తిప్పాలని సంస్థ నిర్ణయించింది.