27 Naxalites killed in enco

ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ – 27కు చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొదట 12 మందే అనుకున్నాం కానీ గంటలు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురు దెబ్బగా నిలిచింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 16 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్లు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కోబ్రా సెక్యూరిటీ ఫోర్సెస్ మావోయిస్టులతో తలపడటం వల్ల తీవ్ర కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల అడ్డాలకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల దాడులు తగ్గించడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ సంఘటన తరువాత బోర్డర్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను నిరోధించేందుకు ప్రత్యేక బలగాలను నియమించారు.

Related Posts
ఏపీలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
Establishment of 63 new can

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా 63 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా Read more

ఒకేసారి బందీలను విడుదల చేయం: హమాస్
ఒకేసారి బందీలను విడుదల చేయం: హమాస్

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానాన్ని తలపిస్తోంది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒప్పందం ప్రకారం Read more

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో విద్యార్థులకు మేలు

విద్యావ్యవస్థను సమూళంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటల్ Read more

హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు
Huge explosion at Hayat Nag

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఉదయం ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి స్టేషన్ ఆవరణలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *