26 additional trains during Sankranti.. South Central Railway

సంక్రాంతికి మరో 26 ప్రత్యేక రైళ్లు : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

హైద‌రాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్​కు అదనంగా కోచ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేసింది. అదనపు కోచ్‌లు జనవరి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ప్రస్తుతం 1,128గా ఉన్న సీటింగ్‌ కెపాసిటీ 1,414కి చేరనుంది.

image
image

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కొన్ని ప్రధాన స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు నేటి నుంచి (జనవరి 10) 17వ తేదీల మధ్యలో సర్వీసులు నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్​ రైళ్లను నడపనున్నారు.

ఈ అన్​రిజర్వ్​డ్​ స్పెషల్​ రైళ్లు చర్లపల్లి నుంచి విశాఖపట్నం స్టేషన్ల మధ్య నేటి నుంచి 17వ తేదీల్లో మొత్తం 16 జన సాధారణ్ రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్​- అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు – కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్​ల వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే రైల్వేస్టేషన్లు అన్నీ రద్దీగా మారాయి. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయటంతో ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తోంది. అయితే రద్దీ దృష్టిలో పెట్టుకుని మరిన్ని రైళ్లు ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Related Posts
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
satyanarayana

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి Read more

ఏలూరులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు
ఏలూరులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. కోళ్ల ఫారం సమీపంలో ఉన్న ఈ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు Read more

సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Justice Sanjiv Khanna as the next senior judge of the Supreme Court

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును..ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సిఫార్సు చేశారు. దీంతో తదుపరి సీజేగా Read more

ఆంధ్ర-తెలంగాణ భాయ్ భాయ్ అంటున్న రేవంత్ రెడ్డి
ఆంధ్ర-తెలంగాణ భాయ్ భాయ్ అంటున్న రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయవలసిన అవసరాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *