chandra babu

20 లక్షల మందికి ఉపాధి: చంద్రబాబు

తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతేకాక కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని అన్నారు. తమను నమ్మిన ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందించారని… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నిర్వహిస్తున్న నరెడ్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


భూ సమస్యలకు సంబంధించి గతంలో ఎన్నడూ చూడని విధంగా దరఖాస్తులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యమని అన్నారు.
ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చంద్రబాబు తెలిపారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని అన్నారు.

Related Posts
శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు కలకలం
fake currency racket busted

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం Read more

తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు
New Judges for Telugu States

ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు న్యాయమూర్తులు.. హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి Read more

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన..స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anitha Says Focused on Women Security in AP

అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 Read more

అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు – మంత్రి నారాయణ
narayaan amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *