16th Finance Commission team visit AP

16th Finance Commission : ఏపీలో 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటన..

16th Finance Commission : రాష్ట్రానికి వచ్చిన పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం నుంచి ఏపీ లో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ , ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఫైనాన్స్ కమిషన్ బృందం రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనుంది. విజయవాడ , తిరుపతి నగరాల్లో పర్యటించనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఫైనాన్స్ కమిషన్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ కానున్నారు.

Advertisements
ఏపీలో 16వ ఆర్థిక సంఘం

ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం

బుధవారం ఉదయం 10:30 గంటల నుండి 11:00 గంటల వరకు సచివాలయంలోని మొదటి బ్లాకులో అమరావతి ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్‌ను ఫైనాన్స్ కమిషన్ బృందం తిలకించనుంది. 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మొదటి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు. సాయంత్రం మూడున్నరకు నోవాటెల్ హోటల్లో ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహిస్తారు.

స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం

అనంతరం రాత్రి ఏడు గంటలకు విజయవాడలోని బెర్మ్ పార్కులో ముఖ్యమంత్రి ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు. రాత్రి పది గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరి వెళతారు. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం అవుతారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవర్గాలతో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి ఈ నెల 18వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది. కాగా రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటా శాతాన్ని పెంచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసే అవకాశం ఉంది.

Read Also: పార్కింగ్ ఫీజుల దోపిడీకి చెక్

Related Posts
Imran Khan: నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్ ఖాన్ నామినేట్
Imran Khan nominated for Nobel Peace Prize

Imran Khan: ప్రతిష్ఠాత్మక 'నోబెల్ శాంతి బహుమతి' కి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు. మానహ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి Read more

వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి కేసు..52 మంది అరెస్ట్..
Vikarabad collector assault case.52 people arrested

వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో దుద్యాల మండలం లగచర్లలో నిన్న ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్‌తో పాటు Read more

రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్‌..
By election polling in Milkipur and Erode (East) constituencies in Tamil Nadu

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. 247 పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌‌, Read more

Pak: పాకిస్థాన్‌లో మండుతున్న ఎండలు ఏకంగా 50 డిగ్రీలు
Pak: పాకిస్థాన్‌లో మండుతున్న ఎండలు ఏకంగా 50 డిగ్రీలు

పాకిస్థాన్‌లో మండుతున్న ఎండలు: ఏప్రిల్‌లో ప్రపంచ రికార్డు దాటే ఉష్ణోగ్రతలు దాయాది దేశం పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన వేడి తీవ్రతను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×