cbn revanth

13న అలయ్ బలయ్.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం – విజయలక్ష్మి

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సారి కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 13న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు.

ఈ కార్యక్రమంతో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరు ఒకే వేదికపైకి వస్తారు. కాగా ఈ అలయ్ బలయ్ లో అన్న రకాల వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వంటలు వడ్డిస్తారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. CMలు చంద్రబాబు, రేవంత్రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.

Related Posts
గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..?: మంత్రి పొన్నం
unnamed file

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు గాంధీ భవన్‌లో 'మంత్రులతో ముఖాముఖి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత Read more

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Bomb threat to Air India flight. Emergency landing

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి Read more

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం..
JPC approved Waqf Amendment Bill

న్యూఢిల్లీ: ‘వక్ఫ్‌ సవరణ బిల్లు’కు ఆమోదం లభించింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఈరోజు సమావేశమైన పలు ప్రతిపాదనలతో బిల్లుకు Read more

Telangana: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి
goverment of telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ మరియు వైస్‌ చైర్మన్‌ ల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రకారం, నల్సార్‌ Read more