12 day remand for the accused in the ration rice misappropriation case

రేషన్ బియ్యం మాయం కేసు..నిందితులకు 12 రోజుల రిమాండ్

విజయవాడ: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి పేర్ని జయసుధకి చెందిన గోడౌన్ లో బియ్యం మాయం కేసులో స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావు నిందితులుగా ఉన్నారు. వీరిని పోలీసులు సోమవారం రాత్రి 11గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలపై సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ2గా బ్యాంక్ ఎకౌంట్ నగదు లావాదేవీల ఆధారంగా రైస్ మిల్లర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ మిల్లర్ బ్యాంక్ ఖాతా నుండి A2 మానస తేజ బ్యాంక్ ఎకౌంట్‌కు రూ. 24 లక్షలు బదిలీ అయినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రైస్ మిల్లర్ బ్యాంక్ అకౌంట్ నుంచి లారీ డ్రైవర్ ఖాతాలకు రూ.16 లక్షలు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు.

Related Posts
ఏపీలో డైకిన్ కర్మాగారం ఏర్పాటు
daikin

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు చొరవతో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు Read more

సీగ్రమ్స్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజికల్ ఉత్సవం..
Seagram Royal Stag Boom Box Musical Festival

‘లివింగ్ ఇట్ లార్జ్’ స్ఫూర్తికి చిహ్నంగా హైదరాబాద్‌లో బోల్డర్ హిల్స్ లో జనవరి 25న మ్యూజిక్ మరియు యువ సంస్కృతి యొక్క వైభవోపేతమైన సంబరం. రాయల్ స్టాగ్ Read more

మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
Chandrababu pays tribute to Manmohan Singh mortal remains

lన్యూఢిల్లీ: ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని Read more

సింగరేణి లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – సింగరేణి ఛైర్మెన్
singareni praja palana vija

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింగరేణిలో ఘనంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *