తెలంగాణాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

పరీక్షలు రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు

10th-exams-in-telangana-starts-from-today

హైదరాబాద్ః తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు మెదలైన పరీక్షలు 12.30 గంటల వరకు జరుగానున్నాయి. మొదటి రోజుకావడంతో పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను నిర్వాహకులు అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 76.5 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం వారే కావడం విశేషం. తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ మీడియం విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు.

వీరికోసం అధికారులు 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిఘా కోసం 144 ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 34,500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. ఈ సారి ఆరు పేపర్లతోనే పది పరీక్షలను నిర్వహిస్తున్నారు.