ఏపీ ఎన్నికల హామీలలో భాగంగా టీడీపీ కూటమి ప్రతిపాదించిన “సూపర్ సిక్స్”లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ముఖ్యమైనది. నవంబరు 1న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సభలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోనున్నారు.
ఈ పథకం కింద అర్హులైన ప్రజలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు, వీటిని ప్రతి నాలుగు నెలలకోసారి పంపిణీ చేస్తారు. దీపం-2 పథకంలో భాగంగా ఉచిత సిలిండర్ల పంపిణీ ద్వారా పేదలపై గ్యాస్ ఖర్చు భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సిలిండర్లు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.