We will complete the Visakha Metro Rail project in two stages. Minister Narayana

రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ మాట్లాడుతూ..మెట్రో పాలసీ ప్రకారం మెట్రో రైల్ కార్పొరేషన్ కు అప్లై చేసారని… మెట్రో రైల్ టెండర్లు గత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల విశాఖ మెట్రో రైలు ఆగిపోయిందని వెల్లడించారు. 76.9 కిలోమీటర్ల 4 కారిడార్ కోసం మూడేళ్ళ తరువాత గత ప్రభుత్వం డిపిఆర్ ఇచ్చిందన్నారు. కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం కాలయాపన చేసిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహించారు.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. మెట్రోరైల్ రాకుండా గ‌త ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింద‌ని మంత్రి విమ‌ర్శించారు. మెట్రో ప్రాజెక్టుపై స్వ‌యంగా కేంద్ర‌మంత్రిని క‌లిసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ వెల్ల‌డించారు.

రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రానికి రాసామని తెలిపారు. 11,491 కోట్లతో ఈ ప్రాజెక్టు చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. ఎండాడ, మద్దిలపాలెం, హనుమంతవాక, స్టీల్ ప్లాంట్ ల వద్ద క్రాసింగ్ ల నిర్మాణం అన్నారు మంత్రి పొంగూరు నారాయణ. ఇక అటు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పై మండలిసభలో చర్చించాలని వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది.

Related Posts
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024!
world aids day

ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎయిడ్స్‌ వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ రోజు ఎయిడ్స్ మరియు Read more

నా వెనుకాల నిలబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి – హరీష్ రావు కామెంట్స్
cm revanth harish

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక కామెంట్స్ చేసారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. Read more

క్యాంపస్ విద్యార్థుల అథ్లెటిక్ ప్రతిభ
Students of KLH Bachupally Campus who achieved excellence in displaying outstanding athletic talent

హైదరాబాద్: అత్యుత్తమ క్రీడా విజయాలు మరియు విద్యావిషయక విజయాలతో కూడిన ఒక సంవత్సరాన్ని కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ జరుపుకుంది. తామెంచుకున్న రంగాలలో రాణిస్తున్న విద్యార్థి-అథ్లెట్లకు ప్రోత్సాహక మైదానంగా Read more

మౌనీ అమావాస్య.. 10 కోట్ల మంది వస్తారని అంచనా..!
Mauni Amavasya 2025

ఈ నెల 29న మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 10 కోట్ల మంది భక్తులు అమృతస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం యూపీ ప్రభుత్వం 12 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *