11 2

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్ని రామకృష్ణారెడ్డి

అమరావతి: మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన గతంలో విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిన్నెల్లి తరఫున న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ కుమారుడు సింగపూర్‌లో ఉన్నత విద్యను కొనసాగించడానికి వెళ్ళనున్నాడు కాబట్టి, తండ్రిగా పిన్నెల్లి కూడా ఆయనతో పాటు వెళ్లాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. పాస్‌పోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇప్పటికే పోలీసుల తరఫున న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరగా, హైకోర్టు 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మునుపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ పొందారు, ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts
భారతదేశంలో ఎరువుల ఆవిష్కరణకు కోరమాండల్ – ఐఎఫ్‌డీసీ భాగస్వామ్యం
Coromandel - IFDC Partnership for Fertilizer Innovation in India

భారత వ్యవసాయ రంగంలో ఎరువుల ఆవిష్కరణకు మరింత ఊతమిచ్చేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్ డెవలప్‌మెంట్ సెంటర్ (IFDC) వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. డిసెంబర్ Read more

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు – మంత్రి కొలుసు
kolusu parthasarathy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, మే, జూన్ Read more

నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
registration charges

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా భూక్రయ విక్రయాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరియు ఇతర లావాదేవీలు పెరిగాయి. చార్జీల పెంపు Read more

అలయ్ బలయ్‌కి సీఎం రేవంత్‌ను అహ్వానించిన బండారు విజయ లక్ష్మీ
Bandaru Vijaya Lakshmi who

18 ఏళ్లుగా ఎలాంటి ఆటంకంలేకుండా అలయ్ బలయ్ ని ఘనంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 19వ అలయ్ బలయ్ ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *