దావోస్: దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. ప్రపంచ దేశాలకు మనోళ్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవలపట్ల గర్వంగా ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉంది. కానీ, ఇండియాలో మాత్రం ప్రధాని మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు.
మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. రెండున్న దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం. అన్నిరంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్, ఆర్థిక సంస్కరణలను ఉపయోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇదే తరహా సేవలు అందించాలి అన్నారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ అంటే, ఇదో పెద్ద లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటారు. కానీ, చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు తెలిసిన మా లాంటి వాళ్ళకి ఇది ఆశ్చర్యం ఏమి కాదు. హైదరాబాద్ ఈ రోజు ఇలా అభివృద్ధి చెందటానికి కారణం నాడు చంద్రబాబు గారి విజన్. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.