Business traits are in the blood of Indians.. Chandrababu

భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు: చంద్రబాబు

దావోస్‌: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. ప్ర‌పంచ దేశాల‌కు మ‌నోళ్లు అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామిక‌వేత్త‌లే క‌నిపిస్తున్నారు. భార‌తీయులు అందిస్తున్న సేవ‌లప‌ట్ల గ‌ర్వంగా ఉంది. ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో రాజ‌కీయ అనిశ్చితి ఉంది. కానీ, ఇండియాలో మాత్రం ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో స్థిర‌మైన ప్ర‌భుత్వం ఉందన్నారు.

మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. రెండున్న దశాబ్దాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం. అన్నిరంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్‌గేట్స్‌ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్‌, ఆర్థిక సంస్కరణలను ఉపయోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇదే తరహా సేవలు అందించాలి అన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్ అంటే, ఇదో పెద్ద లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటారు. కానీ, చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు తెలిసిన మా లాంటి వాళ్ళకి ఇది ఆశ్చర్యం ఏమి కాదు. హైదరాబాద్ ఈ రోజు ఇలా అభివృద్ధి చెందటానికి కారణం నాడు చంద్రబాబు గారి విజన్. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.

Related Posts
ప్రపంచ న్యుమోనియా దినోత్సవం!
world pneumonia day

ప్రపంచ న్యుమోనియా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 12న నిర్వహించబడుతుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా గురించి అవగాహన పెంచడానికి, దీనిని నివారించడానికి మరియు చికిత్స చేసే Read more

సౌత్ కొరియా అధ్యక్షుడిపై దేశద్రోహం కేసు: విదేశాల ప్రయాణంపై నిషేధం
south korea president

సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై విదేశాలకు ప్రయాణించడంపై నిషేధం విధించబడింది. ఈ నిర్ణయం డిసెంబర్ 9న సౌత్ కొరియా పార్లమెంట్ కమిటీ సమావేశంలో దేశం Read more

ఇరాన్ తో సంబంధాలపై ట్రంప్ కొత్త దృష్టి
musk iravani

ప్రముఖ బిలియనియర్ ఎలాన్ మస్క్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఇరాన్-అమెరికా సంబంధాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. మస్క్ ఇటీవల ఇరాన్ యునైటెడ్ Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పై స్పందించిన ప్రశాంత్ కిశోర్..
Prashant Kishor reaction on AAP defeat..

అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందన్న పీకే న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *