anil

బోరుగడ్డకు రాచమర్యాదలు చేసిన పోలీసులు సస్పెండ్

బోరుగడ్డ అనిల్ కేసులో మరో నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అనిల్ కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల అండతో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. వరుసపెట్టి కేసులు నమోదు చేసి వణుకుపుట్టిస్తుంది. కేవలం ఈయనకు మాత్రమే కాదు ఈయనకు రాచమర్యాదలు చేసిన వారికీ..చేయాలనుకునేవారికి కూడా చుక్కలు చూపిస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోరుగడ్డపై నమోదైన కేసుల్లో అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చడం, అనంతరం రిమాండ్ కు పంపడం చేస్తున్నారు.

ఈ క్రమంలో రిమాండ్ లో ఉన్న అనిల్ కు కొంతమంది పోలీసులు రాచమర్యాదలు చేస్తుండడం పై యావత్ ప్రజలు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు, ఓ రౌడీ షీటర్ కు మర్యాలు చేయడం ఏంటి అని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. వారం క్రితం ఓ రెస్టారెంట్ లో అనిల్ కు విందు భోజనం పెట్టిన ఘటనలో పలువురు పోలీసులను సస్పెండ్ చేయగా..తాజాగా జైల్లో మర్యాదలు చేసిన పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అనిల్కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. అనిల్కు స్టేషన్లోనే దుప్పటి, దిండు ఇవ్వడం, మేనల్లుడిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారాయి.

Related Posts
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఆయన రాజీనామాకు దారితీయవచ్చు. లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న Read more

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం
Sukhbir Singh Badal shot in

శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. Read more

లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మొదలైన కార్చిచ్చు..
fire started again in Los Angeles

న్యూయార్క్‌: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఇటీవల చెలరేగిన కార్చిచ్చు మళ్లీ మొదలైంది. తాజాగా మరో ప్రాంతంలో కొత్త మంటలు చెలరేగాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. Read more

కీలక నేతలతో వైఎస్ జగన్ భేటీ
jagan metting

వైసీపీ మరింత బలోపేతం కావడానికి సముచిత వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నేతలతో భేటీ అయ్యారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *