పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా

పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉపముఖమంత్రి పదవి చుట్టూ తిరుగుతున్నాయి . ఇన్నాళ్లు పవన్ చేసిన త్యాగాలు , సహాయాలు గుర్తింపు గా పవన్ కు ఉపముఖమంత్రి పదవి ఇచ్చినట్టు గా చెప్పిన తెలుగుదేశం పార్టీ , వారి అనుచరగణం ఇటీవల కాలం లో చేస్తున్న వ్యాఖలు కొత్త రాజకీయానికి తెర లేపాయి .రాజ్యాంగ రీత్యా ఉపముఖమంత్రి పదవికి ఎటువంటి గుర్తింపు లేదని , రాజకీయం గా సంతృప్తి పరచడం కోసం , రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఒక పదవి అని కొంత మంది వివిధ సామజిక మాధ్యమాలలో వ్యాఖలు చేస్తుండడం ఏపీ రాజకీయాలలో ఒకింత ఆసక్తిని రేకేత్తిస్తోంది . కొంత మంది తమ వాదనను బలపరచడం కోసం గతం లో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావిస్తున్నారు .

పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా
పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా

ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ ఉపముఖమంత్రి పదవికి అర్హుడు అని కొందరు , లోకేష్ ని ఉపముఖమంత్రి గా ప్రకటించాలని కొందరు చేస్తున్న వ్యాఖలు జనసేన నాయకులు , కార్యకర్తలలో అనుమానాన్ని కలిగిస్తున్నాయి .

ఒకప్పుడు పార్టీ అధినేత పవన్ కు ఉపముఖమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలుగు దేశం పార్టీ గౌరవించింది అని తాము భావిస్తే ఇప్పుడు ఉపముఖమంత్రి పదవికి గుర్తింపు లేదంటూ మా నాయకుడిని అవమానిస్తున్నారు అని జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్న జనసేన పార్టీ నేతలు అంటున్నారు .ఒకవేళ నారా లోకేష్ ని ఉపముఖమంత్రిగా ప్రకటిస్తే అది కూటమి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో అని ఇరు పార్టీల నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు .

Related Posts
రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత దిల్ రాజు
revanth dilraju

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గల సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో తనకు Read more

పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు
పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందడుగు వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. Read more

కులగణన నివేదిక ఫేక్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ
teenmar mallanna

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. ఈ Read more

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించవద్దు: సుప్రీం ఆదేశం
suprem court

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ పని చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ చర్యలనైనా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అటవీ (సంరక్షణ) Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *