AP state cabinet meeting today

నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. అయితే ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో .. ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దాంతో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా ఈ కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల తేదీ ఖరారు అయింది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటి వరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ఈ నెల ముగియనుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బడ్జెట్‌తో పలు బిల్లులను రెండు సభల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related Posts
స‌హానా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వైఎస్‌ జ‌గ‌న్
YS Jagan counseled Sahana family

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలోని యువతి సహానా రౌడీషీటర్ నవీన్ చేత దాడి అయ్యి తీవ్రంగా గాయపడిన తర్వాత మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని గుంటూరు Read more

నేడు “సీ ప్లేన్‌”ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu

విజయవాడ: నేడు సీఎం చంద్రబాబు , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు , ఇతర అధికారులు కలిసి విజయవాడ - శ్రీశైలం మధ్య Read more

నేడు సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న ఒమ‌ర్ అబ్దుల్లా..
Omar Abdullah will take oath as CM today

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా ఈరోజు ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీన‌గ‌ర్‌లో ఉన్న షేర్ యే క‌శ్మీర్ ఇంట‌ర్నేష‌న‌ల్ Read more

భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు
భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు

బెంగుళూరులో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదు. బెంగళూరులో ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్యూమోవైరస్ (హెచ్ఎమ్పివి) వైరస్ ఉన్నట్లు గుర్తించారు. నివేదికల ప్రకారం, ఆ బిడ్డకు ఎటువంటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *