Election of AP Deputy Speaker today. Raghurama Krishnam Raju will be announced as Speaker

నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. రఘురామ కృష్ణంరాజును ప్రకటించనున్న స్పీకర్

అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రశ్నోత్తరాల అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం 5 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లు -2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియో ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు -2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ చట్ట సవరణ బిల్లు -2024ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు -2024, ఏపీ విద్యుత్ సుంకం చట్ట సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ MSME పాలసీ 4.0పై ప్రకటన చేయనున్నారు. మంత్రి టీజీ భరత్.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలపై ప్రకటన చేయనున్నారు. 2024-25 బడ్జెట్ పై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలు అయ్యాయి. ఈ మేరకు మూడు పార్టీల నేతల సమక్షంలో రఘురామ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉప సభాపతి పదవికి వీరి పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కు ఆయన తరపున నామినేషన్ పత్రాలను అందజేశారు.

Related Posts
ఎస్సిఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా రమేష్
ఎస్సిఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా రమేష్

సికింద్రాబాద్లోని రైల్ నిలయం వద్ద దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా (పిసిసిఎం) ఎన్ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. రమేష్ ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ Read more

4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా..!
Rythu Bharosa in the accounts of 4.41 lakh farmers.

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరోసా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి రూ.12 Read more

ఇన్ఫోసిస్ నుంచి 400 మంది ట్రైనీల తొలగింపు
infosys

దేశంలో టాప్ ఐటీ కంపెనీల్లో కొన్ని మాత్రం పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాప్ రెండవ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురించే. Read more

అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి తింటే కలిగే లాభాలు
health benefits of anjeer f

ఆరోగ్య నిపుణులు ప్రకారం, అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తినడం శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది. ఈ పండ్లను తేనెతో కలిపి పరగడుపున తింటే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *