Typhoon effect.29 trains cancelled. Railway department announcement

తుఫాన్‌ ఎఫెక్ట్‌..29 రైళ్లు రద్దు : రైల్వే శాఖ ప్రకటన..!

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం: తుఫాను కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు 200 రైళ్లను రద్దు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే కేంద్రాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. రద్దు చేయబడిన రైళ్లు గురువారం నుంచి ఈ నెల 29 వరకు నిలిపివేయబడ్డాయని అధికారులు తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

ఒడిశా తీర ప్రాంతంలో దానా తుఫాన్‌ ప్రభావం కారణంగా ఈ నెల 24న 41 రైళ్లను, తదుపరి 17 రైళ్లను రద్దు చేయడం జరిగింది. తాజా రద్దు గురువారం నుంచి 29 తేదీ వరకు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రధాన రైల్వే స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రద్దయిన రైళ్ల జాబితా..

ఈనెల 24న రద్దైన రైళ్లు..

ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌-హావ్‌డా(22888) హమ్‌సఫర్, భువనేశ్వర్‌-సీఎస్‌టీ ముంబయి(11020) కోణార్క్, భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌(12830), హైదరాబాద్‌-షాలిమార్‌(18046) ఈస్ట్‌కోస్టు..,

ఈనెల 25న రద్దైన రైళ్లు..

చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ (12829), భువనేశ్వర్‌-విశాఖ (20841) వందేభారత్, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (17015) విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌- కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌(17015) ప్రశాంతి, భువనేశ్వర్‌-రామేశ్వరం(20896), పూరీ-యశ్వంత్‌పూర్‌(22883) గరీబ్‌రథ్‌ను రద్దు చేశారు.

ఈనెల 26న రద్దైన రైళ్లు..

పూరీ-గాంధీధామ్‌ (22974), సికింద్రాబాద్‌-సిల్చార్‌ (12513), యశ్వంత్‌పూర్‌-పూరీ (22884) గరీబ్‌రథ్, మంగళూర్‌ సెంట్రల్‌- సంత్రాగచ్చి (22852), ఎస్‌ఎంవీ బెంగళూర్‌-కామాఖ్య(12551),

ఈనెల 27న రద్దైన రైళ్లు..

రామేశ్వరం-భువనేశ్వర్‌ (20895), వాస్కోడిగామ-షాలిమార్‌ (18048) అమరావతి,

ఈనెల 29న రద్దైన రైళ్లు..

మాల్దా టౌన్‌-సికింద్రాబాద్‌ (03430) రైళ్లను రద్దు చేశారు.

కాగా, సహాయ కేంద్రాలు ప్రయాణికుల సౌలభ్యం కోసం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, ఖమ్మం, వరంగల్‌, రాజమండ్రి వంటి స్టేషన్లలో 24 గంటలపాటు సేవలు అందించే హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని అంచనాతో, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రైళ్ల నిర్వహణపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Related Posts
మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు
మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు

జర్నలిస్టుపై దాడి కేసులో పోలీసులు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 9) మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. Read more

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్‌ గుల్‌ ప్రమాణస్వీకారం
Mubarak Gul sworn in as Protem Speaker of Jammu and Kashmir Assembly

శ్రీనగర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరగా బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ Read more

వివాహేతర సంబంధం ద్వారా పిల్లలను కన్నా భర్తే తండ్రి: సుప్రీంకోర్టు
కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోయాయి. అన్యోన్య దాంపత్య జీవితంలో ఈ వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీయడంతో పాటు ఎన్నో నేరాలకు తావిస్తున్నాయి. వాటి వల్ల Read more

సీఎం చంద్రబాబుతో డీజీపీ గుప్తా భేటీ
DGP Gupta met with CM Chand

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *