Attack on iron rod

గాజువాకలో దారుణం ..

ఏపీలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం మారినాకని ప్రేమన్మధులు , కామాంధులు మారడం లేదు. ప్రతి రోజు అత్యాచారం , లేదా ప్రేమ వేదింపులు అనేవి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ వారు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. తాజాగా గాజువాక లో దారుణం జరిగింది.

పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీరజ్‌ శర్మ రాడ్‌తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలు గట్టిగ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని స్థానికులు హాస్పటల్ కు తరలించారు. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆమె తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.

ఇక కాశ్మీర్ కి చెందిన యువకుడి నీరజ్ తో విశాఖ గాజువాక కు చెందిన మేఘనకు కొన్ని ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.. రాజస్థాన్ లో ఓ దైవ కార్యక్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అతని ప్రవర్తన నచ్చక ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. దీంతో మేఘన మీద పగ పెంచుకున్న నీరజ్.. ఆమెను మానసికంగా హింసించసాగాడు. ఆమె ఫొటోలను న్యూడ్ ఫొటోలకు జతచేసి సోషల్ మీడియాలో మేఘన బంధువులకు పంపించేవాడు. దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది. న్యూ పోర్ట్ పోలీసులకు నీరజ్ తో తమ కూతురుకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు బాధితురాలి తండ్రి పాపారావు. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో హెల్మెట్ పెట్టుకుని వచ్చి కూతురు తలపై ఒక రాడ్డుతో బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు.

Related Posts
మన్మోహన్ సింగ్‌‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
Manmohan Singh should be given Bharat Ratna.. CM Revanth

హైదరాబాద్‌: భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపేందుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 26న కన్నుమూసిన మాజీ Read more

దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్
South Korean President Yoon Suk Yeol arrested

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అధికారులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. దేశంలో అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ఆయన చిక్కులు కొనితెచ్చుకున్నారు. ఇప్పటికే అభిశంసనకు Read more

సుప్రీం కోర్టు ఢిల్లీ వాయు కాలుష్యంపై ఆగ్రహం
supreme court india 2021

గత కొన్ని రోజులుగా ఢిల్లీ వాయు క్వాలిటీ సివియర్ ప్లస్ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టు నేడు ఢిల్లీ అధికారులు మరియు కాలుష్య నియంత్రణ Read more

టాటా మోటార్స్ యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాల 10వ వార్షిక నివేదిక విడుదల
Release of 10th Annual Report of Tata Motors CSR activities

ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్, తమ వ్యూహాత్మక కమ్యూనిటీ జోక్యాల యొక్క పరివర్తన ప్రభావాన్ని వేడుక చేసుకుంటూ ఈరోజు తమ 10వ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *