man commits suicide by hang

ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య

ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, రేణిగుంట వద్దకు చేరుకున్నాక కండక్టర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏర్పేడు మండలం అంజిమేడు దగ్గర ఉదయం 5:30కి సదరు యువకుడు బస్ ఎక్కినట్లు కండక్టర్ చెబుతున్నారు. ఉదయం బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో అతను బస్సులోనే.. మంచం నవారి లాంటి తాడుతో పైన కడ్డీకి ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తివారి పల్లి వద్ద యువకుడు ఉరికి వేలుడుతూ ఉండటాన్ని గమనించి షాక్ తిన్నారు తోటి ప్రయాణికులు. వెంటనే బస్సు ఆపిన… కండక్టర్, డ్రైవర్.. రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అతడి వివరాలు తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు.

Related Posts
‘రాజా సాబ్’ కొత్తలుక్ లో ప్రభాస్
'రాజా సాబ్' కొత్తలుక్ లో ప్రభాస్

సంక్రాంతి మరియు పొంగల్ సందర్భంగా రాబోయే చిత్రం 'ది రాజా సాబ్' నుండి కొత్త పండుగ పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించబడింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ Read more

నేపాల్ బంగ్లాదేశ్‌కు 40 మెగావాట్ల విద్యుత్‌ను భారతదేశం ద్వారా ఎగుమతి
Electricity

నేపాల్ నుండి బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా ప్రారంభం అయింది. 2023 మే 31 నుండి జూన్ 3 వరకు భారతదేశానికి వచ్చిన నేపాల్ మాజీ ప్రధాని పుష్ప Read more

రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు..ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
CBN AP Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధ తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమను పట్టించుకోని పిల్లలు లేదా వారసులపై తల్లిదండ్రులు చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం Read more

డ్రోన్ టెక్నాలజీ..ఫ్యూచర్ గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి : మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన 'అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంక్షోభ సమయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *