nani babu

అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ – పేర్ని నాని

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ‘అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ.. గుర్తుంచుకో’ అని పేర్ని నాని సవాల్ విసిరారు. శ‌నివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్‌ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ నాని మండిపడ్డారు. తప్పుడు కేసులతో వైసీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారని , గన్నవరంలో 8 మంది వైసీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నార‌ని పేర్ని నాని ప్రశ్నించారు.

అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైసీపీ జెండా, వైయ‌స్ జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.చంద్రబాబు గుర్తించుకో..ఎల్లకాలం అధికారం ఉండ‌ద, ప్రభుత్వాలు శాశ్వతం కాద‌న‌ని నాని అన్నారు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారుల‌పై తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని ఆయ‌న హెచ్చరించారు.

Related Posts
ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు నవంబర్ 23న ప్రకటించబడతాయి
exit poll

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన ఉత్కంఠభరితమైన ఎన్నికల తరువాత, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు తీవ్రమైన పోటీల మధ్య సాగాయి. Read more

మహారాష్ట్ర ఎన్నికలు 2024: ముంబైలో తక్కువ ఓటు శాతం నమోదు
voting mumbai

మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ముంబై నగరంలో ఈసారి ఓటు శాతం సాధారణంగా తక్కువగా నమోదైంది. 5 గంటల స‌మ‌యం వరకు , ముంబై నగరంలో Read more

అయ్యప్ప ఆలయం మూసివేత..
ayyappa temple closure

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ, మకరు విళక్కు మహోత్సవం ఘనంగా ముగిసింది. ఈ మేరకు సోమవారం రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ట్రావెన్‌కోర్ Read more

తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
Justice Sujoy Paul as the new CJ of Telangana High Court

హైరదాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *