img1

అక్రమంగా తరలిస్తున్న గోమాసం పట్టుబడిన కంటైనర్

అక్రమంగా తరలిస్తున్న గోమాసం.. పట్టుబడిన కంటైనర్. పాతిపెట్టిన పోలీసులు… ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు.!( నక్కపల్లి ,ప్రభాతవార్త) గుట్టుచప్పుడు కాకుండా జాతీయ రహదారి మీదుగా గోమాసాన్ని తరలిస్తుండగా నక్కపల్లి పోలీసులు కంటపడింది. పోలీసుల అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం సమీపంలో ఉన్న సంతపాలెం వద్ద నుంచి రాజమండ్రి వైపు మినీ కంటైనర్ లో 5000 కేజీలు తో వస్తున్న వాహనాన్ని రాబడిన సమాచారం మేరకు కుమార్ స్వామి నేతృత్వంలో ఎస్సై సన్నీ బాబు తో పాటు మిగతా సిబ్బంది మండలంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఈ మేరకు సీఏకే. కుమారస్వామి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ గోమాంసం ఎవరికి తెలియకుండా తరలిద్దామనుకున్నారని, కానీ వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేయగా 5000 కేజీలున్న సుమారు 15 లక్షల విలువచేసే గోమాంసాన్ని తరలిస్తున్నట్లు గుర్తించమని చెప్పారు. డ్రైవర్ మణికంఠను విచారించగా 5 గురు వ్యక్తులు కలిసి ఈ మినీ కంటైనర్ లో ఈ మాంసాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారని చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక వీఆర్వో రెవెన్యూ అధికారులు సమక్షంలో పంచిన నిర్వహించి 5000 కేజీల గోమాంసాన్ని ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో గల ఒక చెరువు వద్ద పాతి పెట్టడం జరిగిందని సీఐ కుమారస్వామి స్థానికులు తెలిపారు. ఈ మాంసాన్ని కొన్నవారు ఎవరు.. ఎక్కడికి పంపిస్తున్నారు. దీనిని ఎవరి ద్వారా కొన్నారు… వీటన్నిటి పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని మణికంఠ ఇచ్చిన సమాచారం మేరకు ఐదుగురు వ్యక్తులను గుర్తించమని వారిపై కేసు నమోదు చేశామని విచారణ అనంతరం అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు.

Related Posts
విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి – ఏపీ సర్కార్ ఆదేశం
Teacher should have lunch with students AP Govt

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మంగళవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 'ఫుడ్ ను తనిఖీ Read more

అదానీ అంశంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌
Pawan Kalyan responded to Adanis issue

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదానీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ తో Read more

ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత
Home Minister Anitha inaugu

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి Read more

మన పోలవరం గ్రేట్: చంద్రబాబు
babuchandra1731422025

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *