anitha sorry

హోంమంత్రి నోట క్షేమపణలు

నిండు అసెంబ్లీ లో ఏపీ హోంమంత్రి అనిత క్షేమపణలు కోరింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార కూటమి , వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాటకు మాట , విమర్శకు ప్రతివిమర్శ ఇలా గందగోళంగా నడుస్తూ వస్తుంది.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మండలి సభలో రాష్ట్ర హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితరాజకీయాలు మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలపై సూటిగా సమాధానం చెప్పడం లేదని , రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారని బొత్స అన్నారు. రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా హోంమంత్రి అనిత తాము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో తాము సభ నుంచి వాకౌట్ అవుతామని హెచ్చరించారు.

దీంతో బొత్స వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్లు చేసిన దౌర్భాగ్యాలు, వాస్తవాలు సభలో వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ముంటే బొత్స నిల్చోవాలని, ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ఆమె వ్యాఖ్యానించారు. సభలో అనిత చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై శాసనమండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దమ్ము, ధైర్యం అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు హోంమంత్రి అనిత వెంటనే క్షమించాలని వేడుకోవడంతో చైర్మన్ శాంతించారు.

Related Posts
నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా: నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల పై కొండా సురేఖ‌
konda surekha take back her comments on samantha Naga Chaitanya divorce

konda surekha take back her comments on samantha, Naga Chaitanya divorce హైదరాబాద్‌: నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ Read more

అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు: కేటీఆర్‌
ktr comments on congress

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా Read more

మళ్లీ ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Bomb threats to Delhi schools again

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం Read more

యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన మోడీ
narendra modi

భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *