mohan babu

సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్

గత కొంతకాలంగా సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు, జర్నలిస్టుపై జరిగిన దాడి వంటి విషయంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు… మంచు మనోజ్ మరోవైపు… కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లిన సమయంలో… ఒక జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలతో పాటు పలువురు తీవ్రంగా ఖండించారు.
ఈ కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ను నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Advertisements

దాడికి సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో, తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచిచూడాలి.

Related Posts
Telangana: నిరుద్యోగులకు శుభవార్త.. త్వ‌ర‌లో ఆర్టీసీలో 3038 పోస్టులకు నోటిఫికేషన్
Telangana Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. త్వ‌ర‌లో ఆర్టీసీలో 3038 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు. ప్రజా పాలన ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఇప్పుడు టీజీఆర్‌టీసీలో 3038 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించనున్నట్టు Read more

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ktr saval

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హైదరాబాద్‌లోని ఓ న్యూస్ సదరన్ సమ్మిట్‌లో శుక్రవారం మాట్లాడగా, రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ Read more

New Railway Line : తెలంగాణలో కొత్త రైల్వే లైన్..ఏ రూట్ లో అంటే..!
New railway line

తెలంగాణలో మరో ముఖ్యమైన రైల్వే ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాణ కార్యకలాపాలు చకచకా సాగుతున్నాయి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూసేకరణ ప్రక్రియ Read more

తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది – ఎమ్మెల్సీ కవిత
BRS MLC kavitha

తెలంగాణలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందని ఆమె ఆగ్రహం Read more

×