Sajjala Bharghav Reddy

సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట

వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది.
ఫిర్యాదు చేయలేదు
భార్గవరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత లేని కేసు అని ఆయన కోర్టుకు తెలిపారు. ఎవరిపై అయితే పోస్టులు పెట్టారో… వారు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎవరో మూడో వ్యక్తి చెపితే కేసులు నమోదు చేశారని చెప్పారు. ఐటీ సెక్షన్స్ కు బదులుగా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని భార్గవరెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
ఫిబ్రవరికి వాయిదా
ఈ క్రమంలో, బీఎన్ఎస్ సెక్షన్ 35 (3)కి అనుగుణంగా నోటీసులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. భార్గవరెడ్డిపై చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను అప్పటి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.

Related Posts
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి – జగన్
jagan tpt

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Read more

నేడు ఏపిలో ‘పల్లె పండుగ’ కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను Read more

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
pawan manyam

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన రాజకీయ నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని హర్షించారు. 2018లో Read more

పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది – పవన్
pawan tirupathi

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే పాలన ప్రారంభమైన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ పలు కీలక మైలురాళ్లు దాటిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *