bhargava reddy

సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో ఊరట

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. భార్గవరెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, టీడీపీ, జనసేన నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును భార్గవ్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. రెండు వారాల పాటు భార్గవరెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కొనసాగుతున్న కేసులు
కాగా వైసీపీ నేతలపై టీడీపీ కేసుల పరంపరలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. కొందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. తమ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.

Related Posts
నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట
Sajjala Bharghav Reddy

వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత Read more

ఏపీ మాజీ గవర్నర్ హరిచందన్ కు అస్వస్థత
Harichandan

ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పై వైద్యులు Read more

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు
NEW PHC

ఏపీలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *