టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పడం క్రికెట్ ప్రపంచాన్ని షాకయ్యేలా చేసింది. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలో అతడు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ నేపథ్యంలో అశ్విన్ రిటైర్మెంట్ గురించి ఆయన సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.మెల్బోర్న్లో మీడియాతో మాట్లాడిన జడేజా, అశ్విన్ రిటైర్మెంట్ తనకు పెద్ద షాకిచ్చిందని చెప్పాడు.”ఆ రోజంతా మేమిద్దరం కలిసే గడిపాం.కానీ, రిటైరయ్యే ఐదు నిమిషాల ముందు, ప్రెస్ మీట్కు ముందు మాత్రమే ఆయన ఆ విషయం చెప్పారు.అది చాలా ఊహించని విషయం. అతని ఆలోచనా ధోరణి ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. ఇది జరగబోతుందన్న సూచనలు కొందరు ఇచ్చినా, నేను నమ్మలేదు.
మైదానంలో నాకు మెంటార్లా ఉండేవాడు.ఇకపై అతణ్ని చాలా మిస్ అవుతాను,”అని జడేజా ఎమోషనల్గా చెప్పాడు. జడేజా ఆపై అశ్విన్తో ఉన్న తన ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.”మేము కలిసి బౌలింగ్ చేయడమే కాదు, మైదానంలో పరిస్థితిని అర్థం చేసుకొని తరచూ ఒకరికొకరు సూచనలు పంపించుకునేవాళ్లం. ఇప్పుడు ఆ అనుభవాలన్నింటినీ కోల్పోతాను. టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం,” అని జడేజా పేర్కొన్నాడు.అయితే, యువ క్రికెటర్లకు ఇది మంచి అవకాశం అని జడేజా అభిప్రాయపడ్డాడు. “వాషింగ్టన్ సుందర్ అతని స్థానానికి సరైన ఎంపికగా కనిపిస్తున్నాడు. భవిష్యత్తులో భారత జట్టు మరింత బలమైన ఆల్రౌండర్, బౌలర్ను పొందుతుందనే నమ్మకం ఉంది,” అని జడేజా తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అశ్విన్ తన టెస్ట్ కెరీర్లో 106 మ్యాచ్లు ఆడి, 537 వికెట్లను తీసి భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 37 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించడంతో పాటు, 3,503 పరుగులు చేసి ఆల్రౌండర్గా తన ప్రతిభను నిరూపించాడు.