Vijayasai reddy

వైసీపీ ఏ కూటమిలో చేరదు: విజయసాయిరెడ్డి

కేంద్రంలో ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని వైసీపీ నేత విజయ సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. తమది న్యూట్రల్ స్టాండ్ అన్నారు. ఏపీలో గత ఐదేళ్లుగా అధికార పార్టీగా ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగిన వైసీపీ తాజా ఎన్నికల తర్వాత మాత్రం దూరంగా ఉంటోంది. దీనికి కారణం ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనలే. వీరిద్దరినీ కాదని తమకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధం కారన్న అంచనాలతో వైసీపీ ఈ స్టాండ్ తీసుకుంది.

అయితే మధ్యలో రాష్ట్రంలో అధికార టీడీపీ నాయకులు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తూ దాడులకు దిగినా పట్టించుకోకపోవడంతో ఇండియా కూటమి నాయకులతో కలిసి జగన్ ఢిల్లీలో ధర్నా కూడా చేశారు.

జగన్ ఢిల్లీ ధర్నాలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు పాల్గొన్నా కీలకమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరంగా ఉండిపోయింది. దీనిపై ఆ తర్వాత జగన్ స్పందించారు కూడా. అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం కేంద్రంలో అధికార, విపక్షాలు అయిన ఎన్డీయే, ఇండియా కూటమికి తాము దూరంగా ఉంటామని ప్రకటించారు.

ఇండియా కూటమి, ఎన్డీఏకు మేం సమాన దూరమని వెల్లడించారు.
అయితే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై మాత్రం తమ పార్టీ అధ్యక్షుడి అభిప్రాయమే చెబుతామన్నారు. ప్రాంతీయ పార్టీగా ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం, ఇండియా కూటమిలో చేరడం కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్న చర్చకు తెరపడినట్లయింది.

Related Posts
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
A huge fire broke out in Parawada Pharmacy

అనకాపల్లి : ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు Read more

నిలిచిపోయిన టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్
TDP Youtubechannel

టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ సేవలు అనూహ్యంగా నిలిచిపోయాయి. ఇది టీడీపీ కార్యకర్తలు, పార్టీ వర్గాల్లో ఆందోళనకు గురిచేసింది. ఉదయం నుంచి ఛానల్ పూర్తి స్థాయిలో పనిచేయకుండా, Read more

విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ ప్రకటన కలకలం
vizag drags case

విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినట్టు ఆరోపణలపై గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. Read more

అదానీ అంశంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌
Pawan Kalyan responded to Adanis issue

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదానీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ తో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *