jagan vijaysaireddy ycp

విశ్వసనీయత అనేది ముఖ్యం: జగన్

వైకాపాను వీడిన రాజ్యసభ ఎంపీ లపై ఆ పార్టీ అధ్యక్షడు జగన్ స్పందించారు.వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ ఈరోజు స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో లేదా రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు.ఇంకా ఒకరో ఆరో వెళ్లిపోయేవాళ్ళుంటే వాళ్ళకైనా అంతేనని వాఖ్యానించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని అన్నారు. విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు.

1400942 ys jagan mohan reddy

వైకాపా నేడు ఇలా ఉందంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు.అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్లు ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? అని జగన్ ప్రశ్నించారు. మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రి? ఆయనకు లిక్కర్ కు ఏం సంబంధమని అడిగారు. ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని విమర్శించారు.

Related Posts
జనసేన ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అనే పేరు
janasena jayakethanam

జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న గ్రాండ్‌గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సభకు ‘జయకేతనం’ అనే పేరు జనసేన Read more

Online Betting : ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం – సీఎం చంద్రబాబు
AndhraPradesh:కలెక్టర్ల సమావేశంలో తల్లికి వందనంపై కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో, ఆన్లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని Read more

AP Government: ప్రజా సమస్యలపై పోరాడే ప్ర‌జా ప్రతినిధులకు అవార్డ్స్
AP Government: ప్రజా సమస్యలపై పోరాడే ప్ర‌జా ప్రతినిధులకు అవార్డ్స్

ఏపీలో కొత్త విధానం – ఉత్తమ ప్రజా ప్రతినిధులకు అవార్డులు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల బాధ్యతను పెంచే కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రజల సమస్యలను Read more

జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
TTD gears up for ‘Vaikunta Dwara Darshan from January 10 to 19

తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల Read more