divyenndu sharma

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ‘మీర్జాపూర్’ యాక్టర్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు మేకర్స్. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్‌ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్‌ టూర్స్‌ను ప్లాన్‌ చేశారు మేకర్స్‌. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాత.

Advertisements

ఇక ఈ సినిమా విడుదలకు ముందే రామ్‌చరణ్‌ తన తదుపరి చిత్రం చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ మైసూర్‌లోమొదలైంది. ఈ తొలిషెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్‌, హీరోయిన్‌ జాన్వీకపూర్‌తో పాటు చిత్రంలో ఇతర ముఖ్య పాత్రదారులు పాల్గొంటున్నారు. కొంత టాకీతో పాటు ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా ఇక్కడ షూట్‌ చేస్తారని సమాచారం. రత్నవేలు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ సంగీత దర్శకుడు ఏఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. వృధ్ధి సినిమాస్‌ పతాకంపై కిలారు సతీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర ఎంతో వైవిధ్యంగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందట. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు చరణ్‌ పాత్రను డిజైన్‌ చేసిన విధానం గొప్పగా ఉంటుందని ఫిలిం నగర్ టాక్‌.

అయితే ఈ సినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ న‌టుడు దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ.. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌నా ‘ఆర్‌సీ16’లో మున్నా భయ్యా న‌టించ‌బోతున్నాడు అంటూ ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భ‌య్య పాత్ర‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివ్యేండు. దీంతో ‘ఆర్‌సీ16’ సినిమాకు అత‌డు ప్ల‌స్ అవుతాడ‌ని చిత్ర‌బృందం భావించిన‌ట్లు ఉంది.

Related Posts
జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం
subbaraju dies

దసరా పండగ వేళ హోంగార్డు ఇంట్లో విషాదం నెలకొన్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మెట్‌పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో Read more

ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న మోదీ
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి భారతీయ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. Read more

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటి..పలు కీలక అంశాలపై చర్చ..!
Telangana cabinet meeting today.discussion on many important issues

హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలు చర్చకు రాబోతోన్నాయి. Read more

ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి
Albendazole tablet

ట్యాబ్లెట్ వేసుకోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించింది అల్లూరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి రస్మిత అనుకోని Read more

×