varma

రామ్ గోపాల్ వర్మపై మ‌రో కేసు

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాకుండా మీడియా, సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇందులో రాజకీయ నాయకులపై చేసే కామెంట్లు, పోస్టులతో పార్టీల కార్యకర్తలతో ప్రశంసలు, విమర్శలు పొందుతూనే ఉంటారు. ఇక టీడీపీ విషయంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లపై ట్వీట్లు, కామెంట్లతో తనదైన శైలిలో ఆర్జీవీ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన వర్మ..ఇప్పుడు కూటమి సర్కార్ లో వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే పలు చోట్లా ఆయనపై కేసులు నమోదు కాగా..ఆయన ను దర్యాప్తు చేసేందుకు పోలీసులు ట్రై చేస్తుంటే..వర్మ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. 2023 జ‌న‌వ‌రి ఎనిమిదో తేదీన ట్విట్టర్ వేదికగా సామాజిక మాధ్యమంలో “కాపు” కులంపై చేసిన వ్యాఖ్యలతో కొత్త వివాదం మొదలైంది. కాపునాడు అంబేడ్క‌ర్ కోనసీమ జిల్లాలోని అమ‌లాపురానికి చెందిన కాపునాడు నాయ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మపై బి.యన్.యస్ 196 సెక్షన్, ఇతర సంభందిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయాలని కోరుతూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్ పిలుపు మేరకు సంయుక్త కార్యదర్శి అబ్బిరెడ్డి శ్రీరామ్మూర్తి, కాపునాడు సంఘ నాయ‌కులు ప‌లువురు అమ‌లాపురం పోలీసుల‌కు పిర్యాదు చేశారు.

Related Posts
ఎన్నికల కమిషన్‌కి కేజ్రీవాల్ విజ్ఞప్తి
ఎన్నికల కమిషన్‌కి కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యర్థి, Read more

నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్
pawan

ఇటీవల కాలంలో నాగబాబుకు మంత్రి పదవిపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర Read more

శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై చిరుత హల్చల్
leopard was spotted crossin

శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి చిరుతపులి కనిపించడం అక్కడి ప్రయాణికులకు షాక్ కలిగించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని వటవర్లపల్లి వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా, కారులో ఉన్న ప్రయాణికులు Read more

రచయిత త్రివిక్రమ్ కన్నుమూత..
Katuri Ravindra Trivikram

సాహిత్య జగత్తులో విశిష్టతను చాటుకున్న రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ (80) విజయవాడలో గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. అరసం గౌరవ సలహాదారుగా, కథా రచయితగా పేరుపొందిన త్రివిక్రమ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *