భారత బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు తన జీవితంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది.హైదరాబాదీ స్టార్ ఆదివారం రాత్రి (డిసెంబర్ 22) వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో హిందూ సంప్రదాయాలను అనుసరిస్తూ,అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు,స్నేహితులు హాజరయ్యారు.సింధు-వెంకట దత్తసాయి వివాహం రాజస్థాన్ మహారాజుల సాంప్రదాయాలకు సాక్ష్యంగా నిలిచింది.సంప్రదాయమైన హిందూ రీతిలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు కొత్త జంటను ఆశీర్వదించాయి.వివాహ వేడుక అనంతరం ఈ జంట మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనుంది.సింధు వివాహ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ,క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సింధు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా పీవీ సింధు భర్త ఎవరన్న దానిపై కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్లో వెంకట దత్తసాయి గురించి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.వెంకట దత్తసాయి హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త. 2018లో ఆయన ఫ్లేమ్ యూనివర్సిటీ నుండి బీబీఏ పూర్తి చేశారు.అంతకుముందు ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో డిప్లొమా సాధించారు.డిగ్రీ పూర్తైన తర్వాత బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్ మరియు మెషీన్ లెర్నింగ్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.పీవీ సింధు తన వ్యక్తిగత జీవితం, కెరీర్లో ఎప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు పెళ్లితో ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. వెంకట దత్తసాయితో కలిసి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సింధు-వెంకట దత్తసాయి జంటకు దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రిసెప్షన్ వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరగనుంది. ఈ వేడుకకు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల హాజరు ఉండనుంది.