women

మైనర్‌ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకునిపోతున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఈ రంగం ఆ రంగం అని కాదు, దాదాపు అన్నిరంగాల్లో ఈ వేధింపులకు గురి అవుతున్నారు. కేరళ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లకాలంగా ఏకంగా 60 మంది తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మైనర్‌ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
18 ఏళ్ల ఆ క్రీడాకారిణి తాను మైనర్‌గా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ సమాఖ్య నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్‌లో క్రీడాకారిణి తనకు జరిగిన దారుణాల గురించి వివరించింది. 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత కోచ్‌లు, క్లాస్​మేట్స్, అథ్లెట్స్​ఎక్కువగా లైంగికంగా వేధించారని వెల్లడించింది.

బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు 62 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలిని కౌన్సిలింగ్‌కు పంపించినట్లు పథనంథిట్ట ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

Related Posts
ఆప్ పథకాలపై గవర్నర్ దర్యాప్తు
పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశం లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఆప్ ఢిల్లీ సంక్షేమ పథకాలపై దుమారం రేగింది. కాంగ్రెస్ నాయకుడు సందీప్ Read more

భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు: హైకోర్టు
భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు: హైకోర్టు

భర్త కాకుండా మరో వ్యక్తితో భార్య శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమం సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Read more

భారతదేశం AI రంగంలో టాప్ 10లో, సాంకేతిక అభివృద్ధిలో ముందడుగు
INDIA AI

భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆవశ్యకత లో టాప్ టెన్ దేశాలలో ఒకటిగా నిలిచింది. ఇది దేశం యొక్క సాంకేతిక పురోగతికి కీలకమైన సూచన. AI రంగంలో Read more

ఢిల్లీ ఎన్నికలు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం..
Delhi Elections.. Polling percentage in the first hours

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *