ttd counters

మూతబడ్డ శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్లు

తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు క్లోజ్ అయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది.. మొత్తం 1.20 లక్షల టికెట్లను భక్తులకు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన కోటా పూర్తికావడంతో కౌంటర్లు క్లోజ్ చేశారు. ఈ నెల 13న తిరిగి వైకుంఠ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజూ 40 వేల టికెట్ల చొప్పున ఏరోజుకు ఆరోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మూడు రోజులకు స్వామి వారి దర్శన టోకెన్లను 1.20 లక్షల భక్తులకు జారీ చేశామని పేర్కొంది. ఈ నెల 18వ తేదీ వరకు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపింది. 12వ తేదీ వరకు దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేశామని, 13వ తేదీ నుంచి ఏరోజుకు ఆరోజు టోకెన్లు జారీ చేస్తామని వివరించింది. కాగా, వైకుంఠ దర్శన టోకెన్ల కోసం బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరగగా ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం తర్వాత భద్రతా సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ.. గురువారం ఉదయం టోకెన్లను జారీ చేసింది.

Related Posts
పంచాయతీల్లో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష
pawan kalyan to participate in palle panduga in kankipadu

రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, Read more

విద్యుత్ వెలుగుల్లో ఏపీ సచివాలయం
Secretariat in electric lig

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని అసెంబ్లీ మరియు సచివాలయం విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. ఈ భవనాలు విద్యుత్ వెలుగులతో ప్రకాశిస్తూ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సచివాలయంపై Read more

అమరావతికి 11 వేల కోట్లు ఆమోదించిన హడ్కో
అమరావతికి 11 వేల కోట్లు ఆమోదించిన హడ్కో

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ Read more

తిరుమల లడ్డు కేసులో నలుగురి అరెస్టు
తిరుమల లడ్డు కేసులో నలుగురి అరెస్టు

తిరుమల లడ్డు కేసులో నలుగురి అరెస్టు.తిరుమల ఆలయంలో పవిత్ర లడ్డు కల్తీకి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ కేసులో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *