మహా కుంభమేళా భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మరియు మహత్తరమైన ఆధ్యాత్మిక వేడుకగా పరిగణించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గంగ, యమునా మరియు అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో జరిగే ఈ మహా ఉత్సవానికి దేశ విదేశాల నుండి లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఈ మహా ఉత్సవం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమగ్రతను చాటుతుంది. అయితే, ఈ ఏడాది మహా కుంభమేళాలో బాంబు బెదిరింపులు వెలువడిన బెదిరింపులు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
త్వరలో ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు తరలి వచ్చేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ కుంభమేళాకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ ఎక్స్ యూజర్ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. మతపరమైన ఈ కార్యక్రమానికి హాజరయ్యే కనీసం 1,000 మందిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యూపీ పోలీసులు సదరు ఎక్స్ యూజర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. మహా కుంభమేళాలో బాంబు బెదిరింపులు భక్తులను భయబ్రాంతులకు గురిచేశాయి.

45 రోజుల పాటు ఉత్సవాలు
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో 45 కోట్లమంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరిచేం అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసం 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు. 1,250 కిలోమీటర్ల పైప్లైనును సిద్ధం చేస్తున్నారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, 2 వేల సోలార్ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. మహా కుంభమేళాలో బాంబు బెదిరింపుల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ రిస్ట్బ్యాండ్స్, యాప్ ట్రాకింగ్లతో భక్తులను లెక్కిస్తారు. యూపీ ప్రభుత్వం మహా కుంభమేళాలో బాంబు బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉంది.
మహా కుంభమేళా భారతీయ సంప్రదాయం, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే గొప్ప ఉత్సవం. ఇలాంటి పవిత్రమైన వేడుకలకు బాంబు బెదిరింపులు రావడం విచారకరం. అయితే, భద్రతా ఏర్పాట్లు మరియు పోలీసుల చర్యలతో భక్తులు తమ విశ్వాసాన్ని కొనసాగిస్తారని ఆశించాలి. ఈ ఘటన అందరికీ భద్రతా చైతన్యాన్ని పెంచడం, శాంతి, సమగ్రతను పరిరక్షించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.