Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. జార్ఖండ్‌లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోcw మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ పోస్టు పెట్టారు. ‘నేటి పోలింగ్‌లో సరి కొత్త రికార్డును సృష్టించాలని’ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా మోడీ ఒక సందేశం ఇచ్చారు. ‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ, యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇకపోతే, జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలకు ఈ నెల 13న తొలి విడత ఓటింగ్ జరగగా, రెండో విడతలో బుధవారం 36 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.

Related Posts
పరీక్షలలో బురఖాపై నిషేధం విధించాలి: మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే
nitesh rane

10 మరియు 12వ తరగతి రాష్ట్ర బోర్డ్ పరీక్షల సమయంలో బురఖా ధరించడాన్ని నిషేధించాలని మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే విద్యాశాఖ మంత్రిని కోరారు. పూర్తి శరీరాన్ని Read more

Telangana:హైకోర్టు కీలక తీర్పు.. పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా
High Court key verdict.. Rs. 1 crore fine for petitioner

Telangana : తెలంగాణ హైకోర్టు ఓ పిటిషన్ విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్ కు ఏకంగా రూ.1 కోటి జరిమానా Read more

వీడిన రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసు మిస్టరీ
rajalinga murthy murder

తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసు మీద ఉన్న మిస్టరీ దర్యాప్తుతో ముక్కణి పెరిగింది. భూపాలపల్లి పోలీసులు ఆరు బృందాలతో చేపట్టిన దర్యాప్తులో ఈ Read more

చంద్రబాబుతో పవన్ భేటీ
Deputy CM Pawan Kalyan meet CM Chandrababu today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ నుంచి నేరుగా సీఎం Read more