మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో ఓ కీలక మార్పు జరగబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం తిరిగి బండి సంజయ్‌కి రాష్ట్రం లో బీజేపీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..? బండి సంజయ్ గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీకి మంచి జోష్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వంలో బీజేపీ గత ఎన్నికల్లో అనూహ్య విజయాలను సాధించింది. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటెల విజయం వెనుక బండి సంజయ్ కష్టం ఎంతో ఉంది.

ఇక, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాల కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎంపీలు అరవింద్, రఘునందన్రావు, డీకే అరుణ, మరియు ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే, బండి సంజయ్ పట్ల పార్టీ లో ఉన్న నమ్మకం, ఆయన ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకే మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

Also Read: రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?

ఇంకా, బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ ను కేంద్రమంత్రిగా నియమించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ తెలంగాణలో బీజేపీకి కీలకమైన నేతగా ఉన్నారు. అలాగే ఆయనపై గౌరవం కూడా ఎక్కువగా ఉంది. ఆయనకు కేంద్రంలో పదవిని ఇచ్చి తెలంగాణలో పార్టీని మరింత శక్తివంతం చేయాలని ఆ పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తెలంగాణలో బీజేపీ రాజకీయాలకు ఒక కీలక మలుపుగా మారిపోతుందనే సూచనలున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి, పోటీని మరింత ఉత్కంఠంగా మార్చేందుకు ఈ పరిణామాలు కీలకంగా మారవచ్చు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Related Posts
టీడీపీలోకి కరణం బలరామ్.. ?
karanam balaram

వైసీపీ సీనియర్ నేత కరణం బలరామ్ పార్టీ మారతారని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన త్వరలోనే టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. Read more

ఎమర్జెన్సీ సినిమా పై కంగనాపై నెగిటివ్ రియాక్షన్స్
ఎమర్జెన్సీ సినిమా పై కంగనాపై నెగిటివ్ రియాక్షన్స్

భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశంగా నిలిచిన ఎమర్జెన్సీని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ రూపొందించిన చిత్రం "ఎమర్జెన్సీ". ఈ సినిమా విడుదలతో మరోసారి Read more

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
pawan kalyan to participate in palle panduga in kankipadu

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అర్థవంతమైన పండుగగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. Read more

బోరుబావిలో చిన్నారి: శ్రమిస్తున్న అధికారులు
boy

రాజస్థాన్: డిసెంబర్ 11, పెద్దల నిర్లక్ష్యంతో పసి పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. నీటి కోసం పొలాల్లో బోరుబావులు గోతులు తీసి నీరు పడకపోతే మల్లి వాటిని Read more