మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన భావాలను వ్యక్తపరుస్తుంటారు. అయితే, ఇటీవల ఆమె పెట్టిన కొన్ని ఆసక్తికరమైన పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఆమె చేస్తున్న ఈ పోస్టులు ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి.తాజాగా, మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మార్కస్ ఆరేలియస్ రాసిన ఒక ప్రేరణాత్మక సందేశాన్ని షేర్ చేశారు. “ఈ ప్రపంచంలో ఏదీ మనది కాదని తెలిసినప్పుడు, కోల్పోయే భయం ఎందుకు?” అనే సందేశం ఆమె అభిమానులను ఆలోచనలో పడేలా చేసింది. దీనితో పాటు, మరో పోస్టులో “ఇకపై నా కోసం నేను ఏది కోరుకోవడం లేదు. ఏదైనా ఆపడానికి ప్రయత్నించడం కూడా ఆపేసాను” అని పేర్కొంటూ, తన మనోభావాలను పరోక్షంగా వ్యక్తపరిచారు.
2024లో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని కూడా మంచు లక్ష్మి తన మరో పోస్ట్లో వెల్లడించారు.ఆమె ఈ విధమైన సందేశాలను ఫ్యామిలీ నేపథ్యానికి అన్వయించుకుంటూ నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.మంచు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న అభిప్రాయ భేధాలను ఈ పోస్టులు ప్రతిబింబిస్తున్నాయా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇటీవలి కాలంలో మంచు కుటుంబంలో అంతర్గత గొడవలపై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంచు లక్ష్మి చేసే ప్రతి పోస్ట్ను ఆమె వ్యక్తిగత జీవితం, కుటుంబ సమస్యలకు అన్వయించటం నెటిజన్ల అలవాటుగా మారింది.
అయితే,ఈ పోస్టుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏదైనా,ఆమె మాటలు అభిమానులను కదిలిస్తున్నాయి.మంచు లక్ష్మి తన జీవితాన్ని తెగించి ముందుకు సాగిపోవాలని అనుకుంటున్నారో, లేక ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వ్యక్తపరుస్తున్నారో ఈ సందేశాల ద్వారా తెలియజేస్తున్నారు. ఆమె స్టోరీలు చూసిన అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.ఈ విధంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత భావాలను పంచుకోవడం ద్వారా మంచు లక్ష్మి ఫాలోవర్లకు చేరువగా ఉంటున్నారు.