visa

భారతీయులకు సౌదీ అరేబియా షాక్

తమ దేశానికి వచ్చే వారిని నియంత్రించడంలో భాగంగా సౌదీ అరేబియా వీసా రూల్స్‌ను కఠినతరం చేసింది. దీంతో భారత్ నుంచి అధికంగా సౌదీ అరేబియాకు వెళ్లే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వీసా నిబంధనల్లో మార్పుల తీసుకువస్తూ.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు వెళ్లి ఉపాధి పొందాలనుకునేవారికి ఆ దేశం కొత్త రూల్స్ పెడుతోంది. ఇళ్లల్లో పనులు చేయడం, భవన నిర్మాణ పనులు, దగ్గరి నుంచి ఒంటెలను చూసుకోవడం సహా అనేక పనులు చేయడానికి భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తూంటారు. ఇవే కాకుండా చాలా ఉద్యోగాలు, పనులు చేసుకునేందుకు సౌదీ అరేబియా దేశానికి వెళ్తున్నారు.

Advertisements

అక్కడి దేశాలకు కార్మికులు చాలా అవసరం. అందుకే భారత్ నుంచి ఎంతో మంది కార్మికులు.. ఆ దేశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే.. ఇప్పుడు అలా ఉపాధి కోసం వస్తున్న వారికి కొన్ని షరతులు పెట్టాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక నుంచి సౌదీ అరేబియా వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా విద్య, వృత్తి అర్హతలను సంబంధించి ముందస్తుగా వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి సౌదీ అరేబియాకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఈ అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సౌదీ అరేబియా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కొత్త వీసా నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

ఈ కొత్త విధానం ప్రకారం.. వర్క్ వీసాలతో దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను తామే జారీ చేసినట్లు సదరు సంస్థలు ధృవీకరించాల్సి ఉంటుంది. ఇక సౌదీ అరేబియాలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు.

Related Posts
Amit Shah : వక్ఫ్ సవరణ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా అమిత్ షా
Amit Shah వక్ఫ్ సవరణ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా అమిత్ షా

దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కేంద్ర Read more

స్వతంత్ర జీవితం గౌరవించుకునే సింగిల్స్ డే..
happy singles day

ప్రతీ సంవత్సరం నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సింగిల్స్ డే (Singles Day) జరుపుకుంటారు. ఈ రోజు పెళ్లి కాని వ్యక్తులు తమ జీవితాన్ని గౌరవించేందుకు స్వీయ ప్రేమను Read more

కుటుంబ సమేతంగా భారత్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు
కుటుంబ సమేతంగా భారత్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు

యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉష వాన్స్ త్వరలోనే భారత్ పర్యటనకు రానున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెలలోనే ఈ Read more

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
Terrorist attack on army vehicle

ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన ఆర్మీ అధికారులు శ్రీనగర్‌: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం Read more

×