The girl was raped by her u

బాలిక పై మేనమామ అత్యాచారం

ఏపీలో మహిళలపై , అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలుఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న కామాంధులు మాత్రం మారడం లేదు. పోలీసులు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న వారు మాత్రం బెదరడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా తాడేపల్లిగూడెం లో వరుసగా మేనమామ అయ్యే వ్యక్తి..9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పై అత్యాచారం చేసాడు.

బాలికకు వరుసకు మేనమామైన కమల్​ తాడేపల్లిగూడెం మండలంలోనే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు బాలిక ఇంటి దగ్గరకు వచ్చేవాడు. బాలిక ఆధార్ ​కార్డులో మార్పులు చేయాల్సి రావడంతో ఈ నెల 14న ఆమె అమ్మమ్మ కమల్​కు రూ.100 ఇచ్చి పంపించి ఆధార్ కార్డు పని చేయాల్సిందిగా కోరింది. దాన్నే ఆసరాగా తీసుకున్నాడు కమల్. దీంతో ఆయన వసతి గృహానికి చేరుకుని బాలికను బైక్ పై ఎక్కించుకుని చాగల్లు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను తాడేపల్లిగూడెం మండలంలోని ఆమె అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో అమ్మమ్మ ఏం జరిగిందని అడగ్గా, కమల్ చేసిందంతా వివరించింది. బాలికను నమ్మించి ఆధార్ పని మీద అతనితో ఇచ్చి పంపించడమే తప్పైంది అంటూ బాలిక అమ్మమ్మ విలపించింది. దీంతో బాలికను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమల్​పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు.

Related Posts
ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
rain ap

రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని Read more

రెండు రోజుల్లో వరద బాధితుల అకౌంట్లలో డబ్బులు వేస్తాం: చంద్రబాబు
CM Chandrababu held meeting with TDP Representatives

అమరావతి: ఇటీవల విజయవాడ నగరంలో బుడమేరు పొంగడంతో భారీ వరద ముంచింది. ఈ వరద కారణంగా చాలా ఇళ్లలోకి నీరు చేరి, ఆవాసాల్లోని అనేక వస్తువులు నష్టపోయాయి. Read more

వంజంగి మేఘాల కొండ,కొత్తపల్లి జలపాతం వద్ద కిక్కిరిసిన పర్యాటకులు
vanjangi

అల్లూరి జిల్లా లో పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి.ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వంజoగి మేఘాల కొండను తిలకించేందుకు పర్యాటకులు తెల్లవారు జాము నుంచే Read more

ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
tiruvuru women protest agai

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రోడ్లపై నిరసనకు దిగారు. అనూహ్యంగా ఎమ్మెల్యే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *