sharmila

ఫ్రీ బస్‌పై చిత్తశుద్ధి లేదు : వైఎస్‌ షర్మిల

మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని ట్విట్టర్‌ వేదిక ద్వారా విమర్శించారు.
అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికోసమని నిలదీశారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా ? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా ? మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ అమలు అయినపుడు ఇక్కడ ఎందుకు కావడం లేదని ఆమె ప్రశ్నించారు.

మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని పేర్కొన్నారు. కనీసం నూతన సంవత్సర కానుక కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని, చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Posts
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు

నందమూరి తారకరామారావు (ఎన్.టి.ఆర్) మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్ ఘాట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్ యొక్క 29వ వర్ధంతి Read more

హోంమంత్రి నోట క్షేమపణలు
anitha sorry

నిండు అసెంబ్లీ లో ఏపీ హోంమంత్రి అనిత క్షేమపణలు కోరింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార కూటమి , వైసీపీ మధ్య Read more

తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు
తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందటంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణా ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. Read more

వాట్సాప్‌లో టీటీడీ, రైల్వే సేవలు: సీఎం చంద్రబాబు
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు.. అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *