Telangana cabinet meeting today.discussion on many important issues

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటి..పలు కీలక అంశాలపై చర్చ..!

హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలు చర్చకు రాబోతోన్నాయి. ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు పెండింగ్ డీఏలతో పాటు, వారి సమస్యలపై కేంద్రీకృతంగా చర్చలు జరగనున్నాయనీ సమాచారం. సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసారు. జీవో నెం.317 కూడా చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉంది.

మూసీ వరద బాధితులకు పరిహారం గురించి కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పై అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీసీ కుల గణన, కొత్త ఆర్వోఆర్ చట్టంపై కూడా కేబినెట్ చర్చించనుందని తెలుస్తోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు కట్టబెడుతున్న నేపథ్యంలో, పురపాలక చట్టంలో సవరణలు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, కొత్త రేషన్ కార్డుల వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించబడే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడులు మరియు రైతుభరోసా పథకం గురించి కూడా కేబినెట్ చర్చించనుంది. ఈ నెలాఖరు లోపు రుణమాఫీ పొందని రైతులకు ఈ పథకం వర్తింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Related Posts
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ స్పందన

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందడం అందరినీ విషాదంలో ముంచేసింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, Read more

నేటి నుంచి విశాఖలో IPL టికెట్లు
IPL2025

విశాఖపట్నంలో ఐపీఎల్ వేడుకలు మొదలయ్యాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఈ టోర్నమెంట్‌లో భాగంగా, విశాఖలోని డ్రైయింగ్ గ్రౌండ్‌గా ఎంపికైన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఢిల్లీ Read more

జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ మంత్రి.. హత్తుకుని ఆహ్వానించిన కేజ్రీవాల్
Ex minister of Delhi who was released from jail. Kejriwal touched and invited

న్యూఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన Read more

విజయసాయి రెడ్డి రాజీనామాకు కారణమేంటి?
Vijayasai Reddy quits polit

వైసీపీ పార్టీకి కీలక నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ సందర్భంగా అనేక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *