రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఉదయం తన నివాసం నుండి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన, అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుండి అర్థరాత్రి 1.30 గంటలకు జ్యూరిచ్ కోసం విమానం ఎక్కనున్నారు.జ్యూరిచ్లో సమావేశాలు, తెలుగు పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక కార్యక్రమం రేపు జ్యూరిచ్లో ముఖ్యమంత్రి పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో జరగనున్న సమావేశాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని భావిస్తున్నారు.

అలాగే, హయత్ హోటల్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. జ్యూరిచ్ నుండి రోడ్డు మార్గంలో దావోస్ చేరుకొని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరపనున్నారు.పెట్టుబడుల ప్రోత్సహానికి బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనను బ్రాండ్ ఏపీ ప్రమోషన్లో భాగంగా రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపును తీసుకురావడంపై దృష్టి సారించారు. ఎయిర్పోర్టులో సీఎంను పలకరించిన అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి విజయవంతంగా ఈ పర్యటనను ముగించుకొని రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలని ఆకాంక్షించారు. విషెస్ చెప్పిన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసం కీలకమని ఆయన నొక్కి చెప్పారు. పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్ను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు.ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతగా ఉపయుక్తంగా మారుతుందో వేచి చూడాలి.