Life tax for petrol and die

త్వరలో తెలంగాణ లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంపు?

పెట్రోల్, డీజిల్ వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చితే తెలంగాణలోనే తక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా త్వరలోనే లైఫ్ ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీలో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్యాక్స్ పెంచితే ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

ప్రస్తుతం తెలంగాణ లో టూ వీలర్ల ధర రూ. 50వేలలోపు ఉంటే 9%,రూ.50వేలకంటే ఎక్కువ ఉంటే 12% లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇక కర్ణాటకలో 18%, కేరళలో 20% చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ లో 4 వీలర్ల ధర రూ.5లక్షల్లోపు ఉంటే 13%,రూ.5L-రూ.10Lకు 14%,రూ.10L-రూ.20L 17%,రూ. 20L+ 18% విధిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో లైఫ్ ట్యాక్స్ 20% నుంచి 21%గా ఉంది. కాగా తెలంగాణ లో ఎలక్ట్రిక్ వెహికల్స్కు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇదే కాదు పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాలకు విధించే రోడ్‌ ట్యాక్స్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో వాహనాలపై వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్‌ విధానం తదితర అంశాలపై కొద్దిరోజుల క్రితం రాష్ట్ర రవాణాశాఖ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలో వాహనాలతో వచ్చే ఆదాయం, పన్నుల శ్లాబుల్ని, ఇతర రాష్ట్రాల్లో రోడ్‌ ట్యాక్స్‌ గణాంకాల్ని బేరీజు వేశారు. ఈ వివరాలతో అధికారులు ఓ నివేదిక రూపొందించగా తర్వలో దీన్ని మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ మేరక మంత్రివర్గ ఉపసంఘం చర్చించి రోడ్‌ ట్యాక్స్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Related Posts
శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన విమాన ప్రమాదం
శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన విమాన ప్రమాదం

హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా అనుకోని సమస్యను ఎదుర్కొంది. ఈ కారణంగా విమానంలో 144 మంది Read more

రామ్ చరణ్ కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?
indias biggest cutout of ra

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న Read more

సింగపూర్ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చర్చలు
సింగపూర్ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చర్చలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ మరియు సింగపూర్ Read more

సాయిబాబా మృతి పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
prof saibaba dies

ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్‌ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. Read more