PM Modi spoke to Donald Trump on phone

డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమెరికా 47వ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన రిప‌బ్లిక‌న్ నేత డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధాని భార‌త్‌, అమెరికా మ‌ధ్య ఉన్న వాణిజ్య బంధాన్ని గుర్తు చేశారు. ట్రంప్ తొలి ద‌శ పాల‌న స‌మ‌యంలో.. ఆయ‌న‌కు మోదీ మ‌ధ్య‌ మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ జ్ఞాప‌కాల‌ను మోడీ నెమ‌రేసుకున్నారు. 2019 సెప్టెంబ‌ర్‌లో హూస్ట‌న్‌లో జ‌రిగిన హౌడీ మోడీ ఈవెంట్‌ను కూడా ప్ర‌ధాని మోడీ గుర్తు చేశారు. 2020 ఫిబ్ర‌వ‌రిలో న‌మ‌స్తే ట్రంప్ పేరుతో అహ్మ‌దాబాద్‌లో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అమెరికా, భార‌త్ మ‌ద్య వూహాత్మ‌క భాగ‌స్వామ్యం గురించి మాట్లాడారు. టెక్నాల‌జీ, ర‌క్ష‌ణ‌, ఎన‌ర్జీ, అంత‌రిక్ష రంగాల‌తో పాటు ఇత‌ర రంగాల్లోనూ సంబంధాల‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఇద్ద‌రూ పేర్కొన్నారు.

మరోవైపు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ట్రంప్‌కు బుధ‌వారం ఫోన్ చేసి అభినందించారు. ఈ విష‌యాన్ని మోదీ త‌న ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా వెల్ల‌డించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో బుధవారం జరిగిన టెలిఫోన్ సంభాషణ చాలా గొప్ప‌గా జ‌రిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ పార్టీ అధినేతతో మరోసారి సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.

“నా స్నేహితుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో గొప్ప సంభాషణ జరిగింది. ఆయ‌న అద్భుతమైన విజయానికి అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, ఇతర రంగాలలో ఇండియా-యూఎస్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరోసారి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం” అని మోడీ ట్వీట్ చేశారు.

Related Posts
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి- చంద్రబాబు
Polavaram diaphragm wall

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులకు నిర్దేశనలిచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, నీటి Read more

కాల్పుల విరమణపై పుతిన్ సూత్రప్రాయ అంగీకారం
కాల్పుల విరమణపై పుతిన్ సూత్రప్రాయ అంగీకారం

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం కల్పించేందుకు అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే, దీనికి Read more

రాహుల్ జీ తెలంగాణకు రండి..యువత పిలుస్తోంది..: కేటీఆర్
Rahul ji come to Telangana.youth is calling

హైదరాబాద్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన విషయం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ Read more

జగన్, విజయసాయి కొత్త డ్రామా – బుద్దా వెంకన్న
buddavenkanna

రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్ కు తెలిసే జరిగిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. 'కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో Read more