Deputy Speaker paid tribute Dr. BR Ambedkar

డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ఉప సభాపతి

అమరావతి : భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈంసదర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటకి అధ్యక్షునిగా అంబేద్కర్ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించుటలో కీలక పాత్ర పోషించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.

ఆనాడు సమాజంలోని పలు కులాల వెనుకబాటు తనాన్ని గుర్తించి త్వరితగతిన ఆయా కులాల వెనుకాటు తనాన్నిరూపు మాపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా రిజర్వేషన్లను పొందుపర్చారని అన్నారు.మన దేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘణత అంబేద్కర్ కే దక్కుతుందని ఉప సభాపతి పేర్కొన్నారు.నేడు దేశమంతా అంబేద్కర్ సేవలను కొనియాడుతోందని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.అంబేద్కర్ సేవలకు గుర్తుగా మన రాష్ట్రంలో ఒక జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడం జరిగిందని ఉప సభాపతి రఘరామ కృష్ణ రాజు తెలిపారు.

ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్న కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఇంకా పలువురు అసెంబ్లీ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్ని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

Related Posts
మహేష్ బాబుకు బిగ్ షాక్
mahesh vote

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించబడిందన్న వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో ఇలాంటి సమస్యలు Read more

 దేవరగట్టు బన్నీ ఉత్సవం .. కర్రల సమరంలో 100 మందికి గాయాలు
bunny fest

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో భారీ కర్రల సమరం: వంద మందికి పైగా గాయాలు కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఆదివారం వేకువజామున జరిగిన బన్నీ ఉత్సవం Read more

లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
Bus Filled Into The Valley Seven People Were Killed

అల్మోరా: ఉత్తరాఖండ్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. Read more

కేంద్ర బడ్జెట్..రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు..
Central budget..Crore hopes on concessions and exemptions..

న్యూఢిల్లీ: సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ నేడు సభలోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *